టాలీవుడ్ లో హీరోయిన్స్ ఎప్పుడూ కరువే.. కాస్త అందం, అభినయం ఉంది అంటే చాలు ఒకటి రెండు సినిమాలకే స్టార్ ఛాన్సులు ఇచ్చేసి ఆమెకు స్టార్ హీరోయిన్ అని పట్టం కట్టేస్తారు. రీసెంట్ గా వచ్చిన కన్నడ భామ రష్మిక ఇప్పుడు టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత పూజా హెగ్దె కూడా వరుస స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. 


ముకుంద, ఒక లైలా కోసం పోయినా ఆ తర్వాత దువ్వాడ జగన్నాథంతో పుంజుకుంది పూజా హెగ్దె. వరుస స్టార్ సినిమా అవకాశాలు అందుకుంటుంది. మరో వారంలో మహేష్ మహర్షితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది పూజా హెగ్దె. సినిమాలో మహేష్ తో పూజా రొమాన్స్ సినిమాకు ప్లస్ అవనుంది. ఇవే కాకుండా ప్రభాస్ రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమాలో కూడా పూజా నటిస్తుంది.


ప్రస్తుతం పూజా క్రేజ్ ను చూసి దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగా పూజా హెగ్దె వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో సెలెక్ట్ చేశారట. ముందు డబ్ స్మాష్ బ్యూటీని హీరోయిన్ గా అనుకోగా ఆమెని కాదని ఆ ఆఫర్ పూజా చెంతకు చేరిందట. ఈ సినిమా కోసం కేవలం 15 రోజుల షూటింగ్ కు 2 కోట్లు అడిగిందట పూజా హెగ్దె.


అరవింద సమేత తర్వాత మహేష్ మహర్షి ఆ నెక్స్ట్ ప్రభాస్ మూవీ ఇలా అమ్మడు స్టార్ ఛాన్సులతో అదరగొడుతుంది. అందుకే తను అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానంది. వాల్మీకి డైరక్టర్ హరీష్ శంకర్ డిజే సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం త్రివిక్రం డైరక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో కూడా పూజా హెగ్దె ఛాన్స్ పట్టేసిందట. చూస్తుంటే అమ్మడు నెక్స్ట్ టాలీవుడ్ నంబర్ 1 హీరోయిన్ అనిపించుకునేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: