కింగ్ నాగార్జున హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం "మన్మధుడు2" , పద్నాలుగేళ్ల క్రితం విడుదలైన "మన్మధుడు" చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రంలో నాగ్ సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం పోర్చుగీస్ లో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  "చిలసౌ" ఫేమ్ రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. 

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో సమంత అక్కినేని నటిస్తుండటం విశేషం, ఈమధ్య కాలంలో సమంత అక్కినేని వారి సినిమాలకు సెంటిమెంట్ గా మారిందని చెప్పాలి.  చాలా కాలంగా పరాజయాలని చవిచూస్తున్న నాగచైతన్యకి కూడా "మజిలీ" చిత్రంతో మంచి విజయాన్ని అందించింది సమంత, అలానే నాగార్జున కూడా ఇటీవల "దేవదాస్" "ఆఫీసర్" చిత్రాలతో ప్లాప్స్ వచ్చిన సంగతి తెలిసిందే.. 

దీంతో  కథలో లేకపోయినా సమంత కోసం స్పెషల్ గా ఒక పాత్రను సృష్టించారట చిత్రబృందం , ఇక ఇటీవలే సమంతతో నాగ్ సన్నివేశాలని కూడా చిత్రీకరించారు, ఈమేరకు సమంత "మన్మధుడు2" చిత్రబృందంతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సెంటిమెంట్ తో పాటు సమంత-నాగార్జునలు గతంలో  కలిసి నటించిన "మనం" "రాజు గారి గది2" చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. దీంతో నాగార్జున ఫాలో అయినా సెంటిమెంట్ తప్పకుండా సక్సెస్ ఇస్తుందని భావిస్తున్నారు అక్కినేని అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: