అవెంజర్స్: ఎండ్గేమ్ దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టిస్తోందా.. రాజమౌళి బాహుబలి సినిమాను మించిన వసూళ్లు రాబడుతోందా..ఇప్పుడు ఈ అంశం వివాదంగా మారుతోంది.
అవెంజర్స్ మూవీ వసూళ్లను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ సినీ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పెట్టిన పోస్టు ఈ వివాదానికి దారి తీసింది. బాలీవుడ్లో తొలివారం వసూళ్లపరంగా ముందున్న ఐదు సినిమాలను ఆయన కంపేర్ చేస్తూ పోస్టు పెట్టారు. అందులో బాహుబలి 2 (రూ.247 కోట్లు-కేవలం హిందీ భాషలో), సుల్తాన్ (రూ.229.16 కోట్లు), టైగర్ జిందాహై (రూ.206.04 కోట్లు), సంజు (రూ.202.51 కోట్లు), దంగల్ (రూ.197.54 కోట్లు) రాబట్టాయని, అవెంజర్స్: ఎండ్గేమ్ రూ. 260.40 కోట్లతో వీటిని బీట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
ఈ పోలికను బాహుబలి సినిమా నిర్మాత శోభూ యార్లగడ్డ స్పందించారు. అవెంజర్స్: ఎండ్గేమ్ అన్నీ భాషా వసూళ్లను , బాహుబలి 2 సినిమా హిందీ కలెక్షన్స్ మాత్రమే తీసుకోవడం సరికాదని బదులిచ్చారు. ప్రముఖ విశ్లేషకులైన మీరు ఈ కోణంలో విశ్లేషించడం సరికాదని తరణ్ కు చురకలు వేశారు శోభు.
బాహుబలి 2 సినిమా తొలివారం అన్నీ వెర్షన్స్ కలెక్షన్స్ కలిపి దాదాపు 420 కోట్లు వసూలు చేసిందట. ఇండియాలో ఈ రికార్డు సాధించడం ఏ హాలీవుడ్ సినిమా వల్ల కూడా కాలేదని శంభు అంటున్నారు. శోభు యార్లగడ్డ వ్యాఖ్యలకు మద్దతు కూడా లభిస్తుంది. కచ్చితంగా శోభూ.. నేను మీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను అని బాహుబలి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ స్పందించారు. మరి తరణ్ ఆదర్శ్ ఎలా స్పందిస్తారో..