డా. రాజశేఖర్ , జీవితల పెద్ద కుమార్తె శివాత్మిక గత ఏడాది హీరోయిన్ గా తన తొలి సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే, యువకథానాయకుడు అడివి శేష్ హీరోగా మొదలైన ఈ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం "2స్టేట్స్" కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడీ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం టాలివుడ్ సర్కిల్స్ లో జరుగుతోంది. 

స్వతహాగా రచయిత అయినా అడివి శేష్ కి "2 స్టేట్స్" అవుట్ ఫుట్ ఆశించిన రేంజ్ లో నచ్చలేదుట. దీంతో ఈ చిత్రంలో మార్పులు చేసేందుకు చాలా ట్రై చేశాడట. అయితే తాను చేసిన మార్పులని దర్శకుడు, నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో శేష్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడట. దీంతో ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయినట్టు తెలుస్తోంది.  

ఇక మొదటి సినిమానే మొదలై ఆగిపోవడంతో శివాని చాలా ఫీల్ అవుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జీవిత-రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక కూడా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి "దొరసాని" అనే పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సురేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: