ఈ మధ్య కాలంలో మాస్ రాజా రవితేజకు అస్సలు టైం కలిసి రావట్లేదు, ఆయన వరుసగా నటించిన "నెల టిక్కెట్" "టచ్ చేసి చూడు" "అమర్ అక్బర్ ఆంటోని" చిత్రాలు డిజాస్టర్స్ గా నిలవడంతో రేస్ లో వెనకపడ్డాడు రవితేజ. అయితే తాజాగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో రవితేజ "డిస్కోరాజా" చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. 

వి.ఐ. ఆనంద్ తో సినిమా అనగానే కథలో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని అనుకున్నారు రవితేజ ఫ్యాన్స్. అయితే  బడ్జెట్ వ్యవహారాల్లో తేడా రావడంతో ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు ఇప్పుడు టాలివుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో రవితేజ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. 

రవితేజతో "డాన్ శీను" "బలుపు" చిత్రాలు చేసిన గోపీచంద్ మలినేని, ఆ రెండు చిత్రాలతో కమర్షియల్ గా మంచి విజయాలను అందుకున్నాడు. అయితే "బాడీ గార్డ్"  "విన్నర్" చిత్రాలతో ఆశించిన విజయాలు అందుకోలేకపోయిన గోపీచంద్ ప్రస్తుతం రవితేజ కోసం ఒక మంచి కమర్షియల్ కథను సిద్ధం చేసాడట. అన్ని అనుకున్నట్టుగా జరిగితే ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా త్వరలోనే మొదలుకానున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: