టాలీవుడ్ను మూడు దశాబ్దాల క్రితం తన హాట్ హాట్ అందాలతో ఏలేసిన సిల్క్స్మిత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పటకీ పెద్ద మిస్టరీగా ఉన్నాయి. ఆమె జీవితానికి సంబంధించిన వచ్చిన డర్టీ పిక్చర్ ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యింది. సిల్క్ స్మిత చనిపోయి రెండున్నర దశాబ్దాలు అవుతున్నా ఆమె ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో ఒక సంచలన విషయం తెరమీదకు వస్తూనే ఉంటోంది.
తాజాగా ఆమె గురించి తెలిసిన ఓ సినీ విశ్లేషకుడు తన తాజా ఇంటర్వ్యూలో ఆమెను చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎలా వాడుకున్నారో చెప్పారు. ఇక టాలీవుడ్ హీరోలపై ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి ఈ విషయంపై కూడా స్పందించి మరో దుమారం రేపింది. సిల్క్ స్మితకు ఇండస్ట్రీలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్న శ్రీరెడ్డి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది.
టాలీవుడ్లో లెజెండ్స్ అని చెప్పుకునే కొందరు హీరోలు ఆమెను శారీరకంగా వాడుకుని వదిలేశారని ఆమె ఆరోపించింది. ఇలాంటి సైకో హీరోల వల్లే ఆమె దెబ్బతిందన్న శ్రీరెడ్డి సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలకు స్కిత బలైపోయిందని వాపోయింది. ఇక ఎప్పుడో జరిగిన సంఘటన గురించి... ఇప్పుడు ఎవరో ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడితే దానిని కూడా శ్రీరెడ్డి సంచలనం చేయాలని... కాంట్రవర్సీ కామెంట్లకు దిగడాన్ని బట్టి చూస్తుంటే శ్రీరెడ్డి రాంగోపాల్ వర్మలా ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలవాలని భావిస్తున్నట్టు ఉంది.