తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో మొదలైనపుడు యాంకర్ గా అనసూయ ఎంట్రీ ఇచ్చింది.  అప్పట్లో అనసూయ హాట్ హాట్ డ్రెస్సులు, మత్తెక్కించే మాటలు కుర్రాళ్లకు పిచ్చెక్కించింది.  అంతే అతి తక్కువ కాలంలో యాంకర్ గా బాగా పాపులర్ అయ్యింది.  వెంటనే ఆమెకు ఇతర ఛానల్స్ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా ఛాన్సలు రావడం..జబర్ధస్ ని వీడటం జరిగిపోయింది.

  ఆమె స్థానంలో అప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన రష్మీని తీసుకు వచ్చారు.  రష్మీ కూడా అనసూయకన్నా రెండాకులు ఎక్కువే చదివింది..హాట్ గా డ్రెస్సులు, వచ్చీరాని తెలుగు మాట్లాడటం ఇలా అందరినీ ఆకర్షించింది.   దాంతో ఆమెకు కూడా వెండితెరపై హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి.  రష్మి ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.  నెటిజన్లు అడిగే ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు ఇవ్వడమే కాదు.. వారు ఏమైనా తేడాగా ప్రశ్నిస్తే క్లాస్ లు కూడా పీకుతుంది.  గతంలో రష్మికి సుడిగాలి సుధీర్ కి మద్య ఏవేవో సంబంధాలు ఉన్నాయని తెగ వార్తలు వచ్చాయి.

వీటిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చింది..తనకు సుధీర్ కేవలం ఫ్రెండ్ మాత్రమే..ఇలాంటి పుకార్లు మరోసారి సృష్టించకండీ అన్నారు. తాజాగా  తాజాగా ఈమెకు తన లైఫ్ పార్టనర్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనికి ఈ బ్యూటీ నాటకీయమైన సమాధానమిచ్చింది.తన శరీరమే తన లైఫ్ పార్టనర్ అంటూ చెప్పుకొచ్చింది. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు తమతో ఉండేది తన శరీరమే..అలాంటి శరీరానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ భలే వేదాంతం వెలిబుచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: