"మహానటి" అలనాటి నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే . ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రం అఖండ విజయాన్ని అందుకొని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.
ఇటు తెలుగు, తమిళం భాషల్లో విడుదలైన ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటనకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇక "మహానటి" ఇప్పటికే 49వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) లో స్థానం సంపాదించిన విషయం తెలిసిందే, అయితే తాజాగా "మహానటి" మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది అదేంటంటే.. షాంగై ఇంటెర్నేషల్ ఫిలిం ఫెస్టివల్ కి కాను "మహానటి" అధికారికంగా సెలెక్ట్ అయ్యింది.
చైనా లోని ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయినా మొదటి తెలుగు చిత్రం "మహానటి" కావడం విశేషం. దీంతో కలెక్షన్స్ పరంగానే కాకుండా అంతర్జితాయా విభాగాల్లోనూ తెలుగు చిత్రానికి పేరు తీసుకొస్తున్న చిత్రంగా "మహానటి" నిలిచింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.