తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’చిత్రం గురించే టాక్ వినిపిస్తుంది.  వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మహర్షి’చిత్రం మే 9న రిలీజ్ కాబోతుంది.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈచిత్రం ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది.  ఇప్పటికే ఈ చిత్రం నుండి  'ఛోటీ ఛోటీ బాతే', 'ఎవరెస్ట్ అంచున', 'నువ్వే సమస్తం', 'పాలా పిట్ట', 'పదరా.. పదరా', 'ఫిర్ సే' వంటి లిరికల్ సాంగ్స్ ని విడుదల చేశారు. తాజాగా 'ఇదే కదా నీ కథ' అంటూ సాగే మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం.

‘ఇదే కదా ఇదే కదా నీ కథ .. ముగింపులేనిదై సదా సాగదా .. "అంటూ ఈ పాట సాగుతోంది. హీరో ఆలోచన .. ఆశయాన్ని ప్రతిబింబిస్తూ ఈ పాట నడుస్తోంది. దేవిశ్రీ సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. విజయ్ ప్రకాశ్ ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లలో దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెత్‌ తో నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన చిత్రం ట్రైలర్ కి మూడు రోజుల్లో పది మిలియన్లకు దగ్గరగా వ్యూస్ రాబట్టింది.  బిజినెస్ మేన్ నుంచి రైతుగా.. విదేశాల నుంచి పల్లెటూరి దిశగా కథానాయకుడి అడుగులు పడే క్రమంలో ఈ పాట తెరపై ఆవిష్కరించబడుతుందని అనిపిస్తోంది. ఈ చిత్రం మహేశ్ బాబు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది...మరో ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: