పవన్ కళ్యాణ్ కు అభిమానులకంటే భక్తులు ఎక్కువగా ఉంటారు అంటూ తరుచు కామెంట్ చేసే హరీష్ శంకర్ పవన్ చుట్టూ తన విషయం పై వస్తున్న వార్తలపై కొద్ది సేపటి క్రితం స్పందించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో వాల్మీకి సినిమాను తీస్తూ బిజీగా ఉన్న హరీష్ శంకర్ చేసిన ట్విట్ పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ కోసం తాను పవన్ తో ఒక సినిమాను చేయడానికి తాను పవన్ కళ్యాణ్ ను కలిసినట్లుగా వచ్చిన వార్తలలో నిజం లేదనీ క్లారిటీ ఇచ్చాడు. అయితే తనకు పవన్ కళ్యాణ్ తో మరొక సినిమా చేయడం తన కల అని అంటూ ఆ కల ఎప్పుడు నెరవేరుతుందో తనకు తెలియకపోయినా పవన్ వీరాభిమానులు మైత్రీ మూవీస్ నుండి అధికారక ప్రకటన ఈ విషయమై వచ్చే వరకు కాస్త ఓపిక పట్టమని పవన్ అభిమానులను అభ్యర్ధించాడు. 

దీనితో మైత్రీ మూవీస్ సంస్థ పవన్ అంగీకారం కోసం వేచి చూస్తూ హరీష్ శంకర్ ను రెడీ పెట్టిందా అన్న సందేహం రావడం సహజం. వాస్తవానికి ఇప్పటికే పవన్ మైత్రీ మూవీస్ కు ఒక సినిమా చేసే విషయంలో భారీ అడ్వాన్స్ తీసుకున్నా ఎన్నికల హడావిడి వల్ల ఆమూవీ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. 

ఇప్పుడు ఎన్నికల హడావిడి పూర్తి కావడంతో పవన్ ఎదో ఒక భారీ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ లో నటిస్తాడు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో హరీష్ శంకర్ వెనుక అర్ధాలు ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో హరీష్ మరొక ట్విట్ చేస్తూ వాల్మీకి డేట్స్ కోసం తాను పూజ హెగ్డేను సంప్రదించ లేదనీ అలాంటి పరిస్థుతులలో రెండు కోట్ల పారితోషిక సమస్య ఎక్కడ నుంచి వస్తుంది అని అంటూ మరొక ట్విస్ట్ కూడ ఇచ్చాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: