ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ సినిమాల నిర్మాణ వ్యయం పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు మన దేశంలో నిర్మాణం జరుపుకున్న సినిమాలు అన్నీ 400 వందల కోట్ల బడ్జెట్ తో తీసినవే. అయితే 500 కోట్లతో రామాయణం 1000 కోట్లతో మహాభారతం తీయాలని ప్రయత్నాలు జరిగినా అవన్నీ చర్చల వరకే పరిమితం అవుతున్నాయి. 


ఇలాంటి పరిస్థుతులలో త్రివిక్రమ్ సన్నిహితుడు కమెడియన్ సునీల్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ 2వేల కోట్ల ప్రాజెక్ట్ ను బయటపెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. గతంలో త్రివిక్రమ్ తాను కృష్ణానగర్ లో ఒక చిన్న గదిలో కలిసి ఉన్నప్పుడు త్రివిక్రమ్ తనకు ఒక అద్భుతమైన కథ చెప్పాడనీ ఆకథను అప్పట్లో సినిమాగా తీయాలి అంటే ఆరోజులలోనే 500 కోట్లు కావాలని చెప్పి తన మైండ్ బ్లాంక్ చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

అయితే ఇప్పుడు ఆ కథను ఎవరైనా త్రివిక్రమ్ చేత డెవలప్ చేయించి సినిమాగా తీయాలి అంటే 2 వేల కోట్లు కావాలని సునీల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్ల సినిమాను తీసే సాహసం ఎవరూ చేయలేకపోతుంటే త్రివిక్రమ్ ను నమ్మి ఎవరు ముందుకు వస్తారు అంటూ కొందరు సునీల్ మాటల పై జోక్స్ వేసుకుంటున్నారు. 

గతంలో మంచు విష్ణు కూడ ఇలాగే హాలీవుడ్ నిర్మాణ సంస్థ  సహకారంతో  'సుందరంకొండ' 'రావణ' లాంటి భారీ సినిమాలు 500 కోట్ల బడ్జెట్ తో తీస్తాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పి తన పై సెటైర్లు పడేలా చేసుకున్నాడు. ఇప్పుడు అదే పద్ధతిలో సునీల్ కూడ త్రివిక్రమ్ ను బాగా ప్రసన్నం చేసుకోవడానికి ఇలా మితిమీరిన పొగడ్తలతో ఏకంగా మీడియా ఇంటర్వ్యూలలోనే చెప్పడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: