సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నయనతార.  ఈ సినిమాలో చాలా సాంప్రదా యంగా కనిపించిన నయనతార, సూర్య నటించిన ‘గజిని’సినిమాలో చాలా హీట్ గా కనిపించింది.  దాంతో నయనతారకు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  తెలుగు, తమిళ స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది.  అయితే నయనతార కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొంది.  తమిళ హీరో శింబుతో ప్రేమాయణం అప్పట్లో ఓ హాట్ టాపిక్ గా మిగిలింది.  కొద్ది రోజుల్లోనే వీరి మద్య విభేదాలు రావడం..ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకులు, నటుడు అయిన ప్రభుదేవతో ప్రేమలో పడటం..పెళ్లిదాకా రావడం జరిగింది.  

Nayanthara with Vignesh Shivan

ప్రభుదేవతో పెళ్లి అనుకున్న కొంత కాలానికే విరి మద్య విభేదాలు తలెత్తాయి..దాంతో బ్రేకప్ చెప్పుకున్నారు.  ఆ తర్వాత కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టి దక్షిణాదిన నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది నయనతార.  అంతే కాదు దక్షిణాది హీరోయిన్లలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ నయనతార కావడం విశేషం.  ఇటీవాల కాలంలో ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్, హర్రర్ సినిమాల్లో నటిస్తుంది. 


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’సినిమాలో, రజినీకాంత్ నటిస్తున్న ‘దర్భార్ ’ సినిమాలో బిజీగా ఉన్నారు నయనతార. కొద్ది కాలంగా నయతార ప్రముఖ దర్శకులు విఘ్నేశ్ శివన్  ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.  విదేశాలు చుట్టి రావడం...సినీ ఫంక్షన్లకు కలిసి వెళ్లడం... ఇద్దరు సహజీవనం చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 


ప్రస్తుతం నయనతార తన చేతిలో వున్న ప్రాజెక్టులను పూర్తిచేసి, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ ఇద్దరూ ఎంగేజ్ మెంట్ కి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. త్వరలో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరుపుకుని, వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. త్వరలోనే ఎంగేజ్ మెంట్ డేట్ చెప్పే అవకాశాలు వున్నాయి.   


మరింత సమాచారం తెలుసుకోండి: