తెలుగు ఇండస్ట్రీలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో ‘రంగస్థలం’లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తీసిన సుకుమార్ తదుపరి చిత్రం కోసం చాలా సమయం తీసుకోవాల్సి వచ్చింది.  వాస్తవానికి రంగస్థలం చిత్రం తర్వాత ఆయన వెంటనే మహేష్ బాబు తో కమిట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆయకు  ఓ కథ వినిపించారని..తర్వరలో సెట్స్ పైకి వెళ్లబోతుందని వార్తలు వచ్చాయి.  గతంలో మహేష్ బాబు తో సుకుమార్ ‘నేనొక్కడినే’ చిత్రం తీశారు..కానీ ఆ చిత్రం ఆశించినంత గొప్పగా హిట్ కాలేదు.  


రంగస్థలం లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత మహేష్ తో చిత్రం అనగానే అభిమానులు కూడా ఎంతో సంతోషించారు.  కానీ అలా జరగలేదు..కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు సెట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్ తో తన తదుపరి సినిమా చేయడానికి  సుకుమార్ రంగంలోకి దిగాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి  సంబంధించిన కథపైనే సుకుమార్ కసరత్తు చేస్తున్నాడట.


గతంలో అల్లు అర్జున్ తో సుకుమార్ 'ఆర్య' .. 'ఆర్య 2' చేశారు. వీరి కాంబినేషన్ కూడా మంచి హిట్ కాంబినేషన్.  మహేష్ తో క్యాన్సల్ అయిన తర్వాత అల్లు అర్జున్ తో కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం రాబోతుంది. 

అయితే సుకుమార్ తో బన్నీ చిత్రం ఎప్పుడా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఈ చిత్రం లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేసే చిత్ర షూటింగు పూర్తయిన తరువాత, సుకుమార్ చిత్రం రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: