టాలీవుడ్ లో అతివేగంగా సినిమాలు తీసే దర్శకుడిగా పూరిజగన్నాథ్ కి పేరుంది. సినిమా ప్రారంభం రోజునే విడుదల తేదీని వెల్లడిస్తాడు పూరి. ఇక ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం "ఇస్మార్ట్ శంకర్" .  యువకథానాయకుడు రామ్ హీరోగా నటిస్తున్న నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం వారణాసిలో  షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. 

ఇదిలా ఉండగా ముందుగా ఈ చిత్రాన్ని మే 31వ తారీఖున విడుదల చేస్తున్నట్లు పూరి జగన్నాథ్ ప్రకటించాడు అయితే ఇంతవరకు సినిమా టీజర్ కానీ, ఫస్ట్ సాంగ్ కానీ విడుదల కాలేదు సరికదా అసలు ఇంత వరకు షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి కాలేదు. అయితే షూటింగ్ డిలే కి జరిగిన కారణాలేంటో తెలిసిరాలేదు. దీంతో ఈ చిత్రం జూన్ కి వాయిదా పడినట్టే అనుకుంటున్నారు సినీ ప్రేక్షకులు. 

ఇక మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్నీ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు.ఇక చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక సతమవుతున్న రామ్-పూరి ఈ సినిమాతో హిట్ కొట్టాలని చాలా కసిగా ఉన్నారు. మరి వీరి కల ఈ చిత్రంతో నెరవేరుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: