సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరు మంచి స్నేహితులు. పవన్ తర్వాత త్రివిక్రం మహేష్ తోనే అంత సాన్నిహిత్యంగా ఉంటాడు. మహేష్, త్రివిక్రం కలిసి మొదట చేసిన అతడు సినిమా సూపర్ హిట్ అవగా ఆ తర్వాత చేసిన ఖలేజా నిరాశ పరచింది. అయితే ఖలేజా సినిమా థియేటర్ లో ఆడకున్నా బుల్లితెర మీద బాగా ఆడింది.


ఇక ముచ్చటగా మూడవసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. అతడు, ఖలేజా ఇలా కాకుండా ఈసారి యూనివర్సల్ సబ్జెక్ట్ తో భారీ బడ్జెట్ తో రూపొందించాలని చూస్తున్నారట. భారీ చిత్రాల నిర్మాత ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది. త్రివిక్రం తో మహేష్ కాంబినేషన్ కే ఓ సూపర్ క్రేజ్ ఉంది.


అలాంటిది ఇద్దరు కలిసి ఓ కంటెంట్ ఉన్న కథను చెప్పాలని అనుకుంటే ఇల ఆ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయం. ప్రస్తుతం మహేష్ మహర్షి రిలీజ్ హడావిడిలో ఉన్నాడు ఈ సినిమా తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సినిమా ఎవరితో అన్నది తేలలేదు.


ఇక త్రివిక్రం విషయానికొస్తే ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మహేష్ తోనే చేసే అవకాశాలు ఉన్నాయట. మహేష్ లైన్ ఓకే అంటే బన్ని సినిమా పూర్తి చేసిన వెంటనే ఆ సినిమా కథ పూర్తి చేసి సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. మొత్తానికి హ్యాట్రిక్ కాంబోగా మహేష్, త్రివిక్రం భారీ సంచలనానికి సిద్ధమయ్యారని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: