మహర్షి ఆడియో ఫంక్షన్ లో మహేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సుకుమార్ గురించి చేసారని పత్రికల్లో రాశారు. చాలా మంది కూడా అలానే అనుకున్నారు. అయితే ఆయన నటించిన ‘మహర్షి’ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, సుకుమార్‌ల గురించి మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారాయన. మహేష్ మాట్లాడుతూ.. పోకిరి అనే సినిమా నన్ను సూపర్ స్టార్‌ని చేసింది.


అదే సందర్భంలో సుకుమార్ దర్శకత్వం వహించిన ‘1 నేనొక్కడినే’ నా కెరియర్‌లో కల్ట్ సినిమా. నాకు ఇష్టమైన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘మహర్షి’ దర్శకుడు నాకోసం రెండేళ్లు వెయిట్ చేశారు.. ఈరోజుల్లో రెండు నెలలు కూడా ఎవరూ వెయిట్ చేయరని అన్నాను. అక్కడ నేను వంశీని పొడిడాను తప్ప.. సుకుమార్‌ గారిని పాయింట్ చేయాలన్నది కాదు. కొంత మంది నేను సుకుమార్‌ని అన్నట్టుగా రాశారు. సుకుమార్ ఒక దర్శకుడిగా కాకుండానే ఒక మిత్రుడు కూడా. ఇందులో కన్‌ఫ్యూజన్ ఏం లేదు. త్వరలో ఆయనతో కలిసి పనిచేస్తా. నాకు సక్సెస్ ఫెయిల్యూర్ అనేది ముఖ్యం కాదు.


నా కెరియర్ గ్రాఫ్‌లో కొన్ని చాలా ఇంపార్టెంట్ సినిమాలు ఉన్నాయి. మురారి సినిమా నాకు చాలా ముఖ్యం. మహేష్ నటించగలడు అని చెప్పిన చిత్రం అది. తరువాత ఒక్కడు నన్ను స్టార్‌ని చేసింది. అతడు నాకు యూఎస్ మార్కెట్ ఓపెన్ చేసిన సినిమా. పోకిరి సూపర్ స్టార్‌ని చేసింది. అందుకే ఆ సినిమా దర్శకులందరికీ థాంక్స్ చెప్పాలి. అంతేతప్ప హిట్ అయిన దర్శకులకే థాంక్స్ చెప్పాలని కాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: