చాలా కాలంగా హిట్ కోసం ట్రై చేస్తున్న దిగ్గజ దర్శకుడు మణిరత్నంకు గత ఏడాది "నవాబ్" చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు, ఇక ఆ విజయంతో మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చిన మణి తన తదుపరి చిత్రంపై ద్రుష్టి పెట్టాడు. మద్రాస్ టాకీస్ సమర్పణలో జియో స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తీ, జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిసింది.

ఇక వీరందరితో పాటు ఈ చిత్రంలో  అమలా పాల్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందట. దీనిపై ఆమె స్పందిస్తూ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న అవకాశం ఇన్నాళ్టికి లభించింది. మణిరత్నం సర్ దర్శకత్వంలో నటించడమే ఒక అదృష్టం అయితే అమితాబ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఉత్తేజాన్నిస్తోంది అని చెప్పింది. 

ఇక ప్రస్తుతం కథ చర్చల్లో ఉన్న ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్ అందిస్తుండగా, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పబడుతున్న ఈ చిత్రం తెలుగు,తమిళం,మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఇక ఈ చిత్రానికి   సంబంధించిన ఇతర వివరాలు అతిత్వరలోనే అధికారిక వివరాలు వెలువడే అవకాశముంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: