"నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" చిత్రం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జోరు పెంచారు. వరుసగా సినిమాల మీద సినిమాలు అన్నౌన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక చేస్తున్న బన్నీ, "ఎంసీఏ" దర్శకుడు వేణుశ్రీరామ్ దర్శకత్వంలో "ఐకాన్" అనే చిత్రాన్ని చేస్తున్నాడు. వీటితో పాటుగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు బన్నీ.. 

అల్లు అర్జున్ 20 వ సినిమాగా తెరక్కెడుతున్న ఈ చిత్రాన్ని మే 11న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోందిట చిత్రబృందం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతంఅందిస్తున్నాడు. ఇక "ఆర్య" "ఆర్య2" చిత్రాల తర్వాత వస్తున్న సుకుమార్ -అల్లుఅర్జున్ కాంబినేషన్ పై వస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది. 

అలానే మైత్రి మూవీమేకర్స్ కి కూడా సుకుమార్  "రంగస్థలం"లాంటి బ్లాక్ బస్టర్ అందిచాడు. దీంతో టోటల్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నారంతా.. ఇక ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: