మహేష్ ఒక జాతీయ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య నమ్రత పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. నమ్రత లేకపోతే తనకు సక్సస్ లేదనీ తన ఆనందం విజయం అంతా నమ్రత చుట్టూనే ముడిపడి ఉందనీ తన సూపర్ స్టార్ స్టేటస్ కు నమ్రత మాత్రమే కారకురాలు అంటూ తనకు నమ్రత పై ఉన్న అభిమానాన్ని వ్యక్త పరిచాడు. 

ఇదే సందర్భంలో తన పిల్లలు గౌతమ్ సితారల గురించి మాట్లాడుతూ వారిద్దరూ స్టార్ పిల్లలు అయినంత మాత్రాన భవిష్యత్ లో వారు ఇండస్ట్రీలోకి వస్తారని తాను అనుకోవడం లేదనీ వారిద్దరూ వారికి ఏది నచ్చతే ఆరంగంలో తాను సెటిల్ చేస్తానని వారి పై తన వ్యక్తిగత అభిప్రాయాలు రుద్దను అంటూ తన పిల్లల భవిష్యత్ గురించి తన ఆలోచనలు వివరించాడు.

ఇదే సందర్భంలో మారక ట్విస్ట్ ఇస్తూ తనకు బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘యూరి’ లాంటి వార్ సినిమాలో నటించాలని ఉందనీ అయితే తనకు అటువంటి కథలు ఇప్పటి వరకు ఏ దర్శకుడు చెప్పడం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. అయితే తాను నిర్మాతగా మారి అడవి శేషుతో ఒక వార్ ఫిలింను తీయబోతున్నట్లు లీకులు ఇచ్చాడు. 

ఇక తన వయసు పెరుగుతున్నా పెరిగిపోతున్న తన గ్లామర్ గురించి మాట్లాడుతూ తాను అతి తక్కువగా తినడం వ్యసనాలకు దూరంగా ఉండటంతో పాటు ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం వల్ల తన గ్లామర్ తగ్గడం లేదనీ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు తన కుటుంబం మాత్రమే తనకు ఇష్టమైన స్వర్గం అని అంటూ తన ఆనందం అంతా తన కుటుంబమే అని అంటున్నాడు. ఇక పూరి జగన్నాథ్ తాను తన స్పీచ్ లో మరిచిపోయిన సందర్భం గురించి వివరిస్తూ పూరి ‘పోకిరి’ లేకుంటే సూపర్ స్టార్ మహేష్ లేడనీ పొరపాటున ఆయన పేరు తాను తన స్పీచ్ లో మరిచిపోతే మీడియా తన పై వేసిన సెటైర్లు చూసి ఖంగారు పడిపోయానని అందుకునే తాను రాజకీయాలకు పనికిరానని అంటూ తనపై తానే కామెంట్స్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్..   



మరింత సమాచారం తెలుసుకోండి: