యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రన్ రాజా రన్ సినిమతో తొలి సినిమాతోనే ప్రతిభ చాటుకున్న సుజిత్ రెండో సినిమా భారీ సినిమా తీస్తున్నాడు. 200 కోట్ల బడ్జెట్ అనుకున్న ఈ సినిమా దగ్గర దగ్గర 300 కోట్ల దాకా అవుతుందని అంటున్నారు. 


ఇదిలాఉంటే ప్రభాస్ సాహో అవుట్ పుట్ మీద అసంతృప్తిగా ఉన్నాడని లేటెస్ట్ టాక్. అబుదాబిలో తీసిన యాక్షన్ సీన్స్.. మరికొన్ని యాక్షన్ సీన్స్ ఫైనల్ అవుట్ పుట్ పై ప్రభాస్ అంత సాటిస్ఫైడ్ గా లేదన్నది ఇన్నర్ టాక్. చిత్రయూనిట్ మాత్రం సినిమా అలా ఉంది ఇలా ఉందని అంచనాలు పెంచేస్తుంటే ప్రభాస్ మాత్రం అవుట్ పుట్ విషయంలో కొంత నిరాశకు గురయ్యాడని అంటున్నారు.


బాగాలేని సీన్స్ ను మళ్లీ రీ షూట్ చేయాలని డైరక్టర్ ను కోరాడట. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న సాహో సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా కూడా భారీ బడ్జెట్ తో వస్తుంది. సాహో సినిమా నుండి ఈమధ్య రిలీజైన మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచాయి.


సాహోలో విజువల్ గ్రాఫిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే రీ షూట్స్ వల్ల రిలీజ్ అనుకున్న టైం కు కష్టమని తెలుస్తుంది. ప్రస్తుత ఆగష్టు 15న సాహో రిలీజ్ అనుకున్నారు కాని ఆ టైం కు రావడం కష్టమే అని తెలుస్తుంది. రిలీజ్ లేటైనా పర్వాలేదు కాని అంచనాలను అందుకునేలా తెరకెక్కిస్తే చాలని అంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: