ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా బిజీగా ఉన్న సంగీత దర్శకుడు తమన్, ఇప్పటికే టాలివుడ్ యువ హీరోలందరితో పనిచేసిన తమన్.. నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి బడా హీరోలందరి సినిమాలకి బాణీలు అందించి సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. 

ఇదిలా ఉండగా తమన్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం రోహిత్ శెట్టి దర్శకత్వంలో "సూర్యవంశీ" అనే నూతన చిత్రాన్ని చేస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ దశకు చేరుకోబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. రోహిత్ శెట్టి , తమన్ కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇంతకుముందు రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన గోల్ మాల్ 4, సింబా చిత్రాలకు తమన్ సంగీతం అందించాడు. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తుండడం విశేషం. 

ఇక తెలుగులో తమన్ ప్రస్తుతం అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాకు పనిచేస్తున్నాడు ఈ సినిమాతో పాటు మరో మూడు నాలుగు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయి, ఇప్పుడు బాలీవుడ్ లో అక్షయ్ సినిమాకి పనిచేస్తుండడంతో త్వరలో బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడు తమన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: