సూపర్ స్టార్ మహేష్, ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా గురించి తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేదాకా వెయిట్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, రాం చరణ్, ప్రభాస్ వంటి స్టార్స్ తో రాజమౌళి సినిమా తీయగా మహేష్ తో మాత్రం తీయలేదు. అసలైతే మహేష్ సినిమా కోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు జక్కన్న. కాని ఆ కాంబో ఇప్పటివరకు సెట్ అవలేదు. 


ప్రస్తుతం మహర్షి రిలీజ్ హంగామాలో ఉన్న మహేష్ తన తర్వాత సినిమా అనీల్ రావిపుడి సినిమాతో ఫిక్స్ చేసుకున్నాడని తెలిసిందే. ఇక మహర్షి ప్రమోషన్స్ లో రాజమౌళి డైరక్షన్ లో సినిమా గురించి స్పందించాడు  మహేష్. రాజమౌళితో సినిమా చేయాల్సి ఉన్నా అది వెనక్కి పోతుందని త్వరలోనే ఆ సినిమాపై ఓ ఎనౌన్స్ మెంట్ వస్తుందని అన్నారు సూపర్ స్టార్ మహేష్.


బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా ఇద్దరు రియల్ హీరోస్ కథతో చేస్తున్నాడు జక్కన్న. సినిమా ఎనౌన్స్ మెంట్ ఆ తర్వాత ప్రెస్ మీట్ రాజమౌళి సినిమా అంటే ఇలానే ఉంటాయన్నట్టుగా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా తర్వాత మ్యాక్సిమం మహేష్ తోనే సినిమా ఉండే అవకాశం ఉందట.


ఈ కాంబినేషన్ లో సినిమాకు కె.ఎల్ నారాయణ ఎప్పుడో అడ్వాన్సులు ఇచ్చాడు. ఇద్దరు కలిసి చేసే టైం రావట్లేదు. అయితే మహేష్ మాటలని బట్టి చూస్తుంటే ఈసారి రాజమౌళితో తన సినిమా పక్కా అన్నట్టుగా ఉంది. మహేష్ తో రాజమౌళి సినిమా అంటే ఇక ఆ సినిమా సృష్టించే ప్రభంజనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఆ సినిమా కోసం ప్రతి తెలుగు సిని ప్రేమికుడు ఎదురుచూస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: