టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి2’ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’మూవీ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విశేషాలు ఆ మద్య ఓ ప్రెస్ మీట్ లో వివరించారు. భారీ తారాగణంతో ఈ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్, రాంచరణ్ లతో పాటు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగాన్ నటిస్తున్నారు. రాంచరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ నటిస్తుంది.
ఇక ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ మద్య పూనే లో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో జిమ్ లో రాంచరణ్ మోకాలికి గాయం కావడంతో షూటింగ్ ఓ నెలరోజుల పాటు వాయిదా వేశారు. ఈ మద్య హైదరాబాద్లో ఎన్టీఆర్పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, ఆయన చేతి మణికట్టుకి గాయమైంది. దీంతో ఆయన వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యం తీసుకున్నారు.
నేడు ఎన్టీఆర్, ప్రణతి దంపతుల పెళ్లిరోజు నేడు. వీరి వివాహం జరిగి నేటికి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతోంది. 2011 మే5న తారక్, ప్రణతిల వివాహం ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. అభయ్ రామ్, భార్గవ్ రామ్. నేటితో వారి వివాహం జరిగి 8 సంవత్సరాలు పూర్తి కావడంతో ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్లో ప్రణతితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. 'ఎనిమిదేళ్లు.. మున్ముందు మరెన్నో సంవత్సరాల కోసం ఎదురుచూస్తున్నాం' అని పేర్కొన్నాడు. తాజాగా మరోసారి ఆయన కట్టుతో కనిపించడంతో అభిమానులలో చర్చ మొదలైంది. ఓ వైపు అభిమానుల నుంచి తారక్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు ఎన్టీఆర్ గాయంపై రక రకాల చర్చలు మొదలయ్యాయి. ఫోటోలో ఎన్టీఆర్ చేతికి కట్టు ఉండడాన్ని చూసిన అభిమానులు ఈయన చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి మరింత టైం పట్టొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ కోలుకున్నాక సినిమా చిత్రీకరణను కొనసాగిస్తారు. 2020 జులై 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.