సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా తర్వాత అనీల్ రావిపుడి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు అనీల్ రావిపుడి సక్సెస్ ఫాం కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ తోనే ఓ క్రేజీ మూవీ చేస్తున్నాడు. మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా గురించి అఫిషియల్ గా మాట్లాడారు. కామెడీ ఎంటర్టైనర్ సినిమాలే అయినా వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమాత్రం మిస్ అవ్వని అనీల్ రావిపుడి మహేష్ కోసం అదిరిపోయే కథ రాశాడట.


ఈ సినిమాలో మహేష్ రోల్ కామెడీ పండిస్తుందని తెలుస్తుంది. అయితే మహేష్ కామెడీ అనగానే ఖలేజా, దూకుడు రెండు సినిమాలు గుర్తుకొస్తాయి. ఖలేజా సినిమా త్రివిక్రం డైరక్షన్ లో రాగా అది సిల్వర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత బుల్లితెర మీద మాత్రం తెగ ఆడేసింది ఖలేజా. ఇక శ్రీను వైట్ల డైరక్షన్ లో వచ్చిన దూకుడు సినిమా మాత్రం మహేష్ కు సూపర్ హిట్ ఇచ్చింది.


ఇక ఇప్పుడు అనీల్ రావిపుడి సినిమా కూడా కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. రీసెంట్ గా మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహర్షి తర్వాత మళ్లీ సీరియస్ సబ్జెక్ట్ ఎందుకని ఎంటర్టైన్మెంట్ స్టోరీ ఎంచుకున్నా అని చెప్పాడు మహేష్. సో మహేష్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అనీల్ రావిపుడి స్టైల్ లోనే ఈ సినిమా ఉంటుందన్నమాట. ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తారని తెలుస్తుంది.


మహేష్ మహర్షి రిలీజ్ ముందే హిట్టు కొట్టడం పక్కా అన్నట్టుగా పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నారు చిత్రయూనిట్. ఇక అనీల్ రావిపుడి సినిమా తర్వాత మహేష్ ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న రాజమౌళి డైరక్షన్ లో మూవీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో మహేష్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: