ఈవారం విడుదల కాబోతున్న ‘మహర్షి’ మూవీకి ఒకేసారి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ సునామీలా రావడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈమూవీ టిక్కెట్లకు ఏర్పడుతున్న మ్యానియాను పరిశీలిస్తున్నవారు ‘మహర్షి’ కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ సునామి ఖాయం ఖయాం అని అంటున్నారు.
ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు అల్లు అర్జున్ ప్రభాస్ లు అందిస్తున్న పరోక్ష సహాయం పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ ప్రభాస్ యూవీ క్రియేషన్స్ భాగస్వాములుగా దిల్ రాజ్ తో కలిసి ఈమూవీ కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడంతో ‘మహర్షి’ మ్యానియా ప్రభాస్ బన్నీలకు కూడ సోకిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఈమూవీ తొలిరోజు కలక్షన్స్ పై అప్పుడే ఆసక్తికర అంచనాలు మొదలైపోయాయి. తెలుస్తున్న సమాచారం మేరకు హైదరాబాద్ లోని ఎషియన్ గ్రూప్లో ఉన్న మల్టీఫ్లెక్స్ స్క్రీన్లలో టిక్కెట్ల బుకింగ్ స్టార్ట్ చేయగా ఈసినిమాకు సంబంధించి ఫస్ట్ డే కోసం లక్షన్నర టిక్కెట్లు అప్పుడే అమ్మకం జరగడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమాకు సంబంధించి ఇంకా పీవీఆర్ ఐనాక్స్ బుకింగ్లు ఓపెన్ కాకపోయినా ఇంకా ట్విన్ సిటీస్లో ఉన్న సింగిల్ థియేటర్లు అడ్వాన్స్ ఓపెన్ కాకపోయినా ఈ స్థాయిలో ‘మహర్షి’ టిక్కెట్లు అమ్మకం జరుగుతున్నాయి అంటే ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ మహేష్ సినిమాలలో ఒక కొత్త రికార్డ్ సృష్టిస్తుంది అని అంటున్నారు. ఈ ఏడాదికి మళ్లీ ‘సాహో’ వచ్చే వరకు మరో భారీ చిత్రంలేని పరిస్థితులలో ఈమూవీకి అన్ని పరిస్థితులు కలిసి వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా పై నెగిటివ్ ట్రెండ్ కొనసాగినా ఒకేసారి ఈ మూవీ పాజిటివ్ ట్రెండ్ వైపు యూటర్న్ తీసుకోవడంతో ‘మహర్షి’ బయ్యర్లు ఊపిరి పీల్చుకుంటున్నారు..