'బాహుబలి' వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత అదే స్థాయిలో విజయం సాధించాలని భారీ బడ్జెట్ సినిమా 'సాహో' సినిమా కథ ఎంచుకొన్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు ఏడాదిన్నరకు పైగా షూటింగ్ జరుపుకుంటున్న ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి కాలేదన్న వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు చాలా నిరుత్సాహంగా మరియు సినిమా యూనిట్ పై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం.

Image result for sahoo prabhas

గతంలో ఈ సినిమా మొదలు పెట్టిన సమయంలో సినిమాకి సంబంధించిన ఒక వార్త కూడా ఎడిట్ చేయని సినిమా యూనిట్ పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అయిన సందర్భంలో..సినిమాకి సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ మరియు వీడియోను విడుదల చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

Image result for sahoo prabhas

అసలు విషయానికొస్తే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాల విషయంలో సినిమా యూనిట్ సంతృప్తిగా లేరని దీంతో ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలని ప్రభాస్ ని కోరారట. దీంతో ప్రభాస్ సినిమా యూనిట్ పై ఫైర్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: