మాస్ కథానాయకుడు గోపీచంద్ కి సరైన హిట్ పడి చాలా కాలమయ్యింది. "గౌతమ్ నంద" "సౌఖ్యం" "ఆక్సిజెన్" "పంతం" "ఆరడుగుల బులెట్" ఇలా ఈ సినిమాలన్నీ గోపీచంద్ నిరాశపరిచాయి. దీంతో రేస్ నుంచి కాస్త వెనకపడిన గోపీచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తీరు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గోపీచంద్ స్పై పాత్రలో  నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని  అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవలే  పాకిస్థాన్‌ బార్డర్‌లో 45 రోజులుగా యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించింది చిత్ర బృందం. పాకిస్థాన్ షెడ్యూల్ పూర్తి కావడంతో హైదరాబాద్ లో డ్యూయెట్స్ తీసే యోచనలో ఉన్నారు సినిమా యూనిట్. 

అయితే ఈ చిత్రానికి ఇప్పుడు అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువ అవుతోందిట, టాలీవుడ్ సర్కిల్స్ లోని కథనాల ప్రస్తుతం ఉన్న గోపీచంద్ మార్కెట్ కంటే డబుల్ రేంజ్ లో నిర్మాణం జరుగుతోందిట, దీంతో ఇప్పుడు ఈ సినిమాను హిట్ చేసే భారం గోపి భుజాలపైనే పడిందనుకుంటున్నారు అభిమానులు. ఇక ఈ చిత్రం కథానాయికగా  మెహరీన్, బాలీవుడ్ భామ జియాఖాన్ నటిస్తున్నారు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: