సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోని  25వ సినిమా అయిన "మహర్షి" మే 9న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అల్లరి నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా విడుదల కోసం ఎదురు చుస్తున్నారంతా. 

ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని తెలుగు సినిమా అగ్ర నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీ దత్, పివిపి ప్రసాదులు సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక వీరితో పాటు మరో బడా నిర్మాత అల్లు అరవింద్ కూడా చేరారు, కృష్ణ జిల్లా పంపిణి హక్కులను ప్రతిష్టాత్మక గీత ఆర్ట్స్ సంస్థ తరపున ఆయన కొనుగోలు చేశారు. దీంతో ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలందరి ద్రుష్టి ఇప్పుడు "మహర్షి" పైనే పడింది. 

ఇక 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 20 కోట్లకు అధికంగా అంటే 140 కోట్లకుగాను ప్రపంచ వ్యాప్తంగా సేల్ చేశారు. దీంతో ఇప్పుడు 140 కోట్ల రికవరి పై ప్రాఫిట్ రావాలి అంటే ఈ చిత్రం ఇప్పుడు కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. దీంతో ఈ సినిమాలో భాగం పంచుకున్న బడా నిర్మాతలందరూ ఇప్పుడు "మహర్షి" వసూళ్లపై టెన్షన్ గా ఉన్నారు. మరి "మహర్షి" వారి అంచనాలను అందుకుంటాడో లేదో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: