తెలుగు ఇండస్ట్రీలో ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మాలీవుడ్ బ్యూటీ సాయిపల్లవి.  గతంలో తెలుగు లో ఓ డ్యాన్స్ షో లో కనిపించిన సాయిపల్లవి తర్వాత మాలీవుడ్ లో ‘ప్రేమమ్’చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.  తెలుగు లో మరికొన్ని చిత్రాల్లో కనిపించిన సాయిపల్లవి..ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. 

వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తనదైన శైలిలో ట్రెండ్ సెట్ చేస్తోన్న అమ్మడు రౌడీ బేబీ సాంగ్ తో మరో స్థాయికి చేరుకుంది. మారి 2  చిత్రంలో సాయి పల్లవి డ్యాన్స్ కి అభిమానులు మరోసారి ఫిదా అయ్యారు.  ప్రస్తుతం సూర్య నటిస్తున్న  NGKచిత్రంలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.   ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ..సాయి పల్లవి ఎంతో అంకితభావంతో..చాలా జాలీగా నటిస్తారని..ఎలాంటి ఇబ్బందులు పెట్టే మనస్తత్వం ఆమెది కాదని అన్నారు. 

ఇచ్చిన వర్క్ ఎంతో డెడికేషన్ గా చేస్తుందని అన్నారు. సెట్స్ లో అందరితో చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు.  కాకపోతే NGKచిత్రంలో సాయి పల్లవి రెండు మూడు సీన్ల కోసం ఎక్కువగా టేక్స్ తీసుకుందట..దాంతో తన వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుందని సెట్ లోనే ఏడ్చేసిందట.  వెంటనే సూర్య వెల్లి ఓదార్చారట..ఎక్కువ టేక్స్ తీసుకున్నా ఆ సీన్లు చాలా అద్భుతంగా వచ్చాయని.. ఆ విధంగా సాయి పల్లవి బాధపడటం చూస్తే నటనపై ఆమెకున్న ఇష్టం అందరికి అర్థమైందని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: