ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు చేసే ప్రతిఒక్క పని వైరల్ అవుతున్నాయి.  ముఖ్యంగా కాంట్రవర్సీలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  లేనిది ఉన్నట్లుగా..ఉన్నది లేనట్టు సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాల రావడం దాన్ని కవర్ చేసుకోలేక సెలబ్రిటీలు నానా తంటాలు పడటం చూస్తునే ఉన్నాం. 

తాజాగా టాలీవుడ్, కోలీవుడ్ లో తమ అందాలతో కుర్రాళ్లకు మత్తెక్కించిన ముద్దుగుమ్మలు త్రిష, చార్మీ.  వీరిద్దరూ ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘పౌర్ణమి’సినిమాలో నటించారు.  అప్పటి నుంచి త్రిష, చార్మిల మద్య మంచి స్నేహబంధం ఏర్పడింది.  ప్రతి పుట్టిన రోజు వేడుకలో వీరిద్దరూ కలవడం సందడి చేయడం తెలిసిందే.  ఆ మద్య ఛార్మీ పుట్టిన రోజు సందర్భంగా త్రి తనను పెళ్లి చేసుకుంటావా అని పోస్టింగ్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ ట్విట్ అప్పట్లో పెద్ద సెన్సేషన్ సృస్టించింది.   

ఇక త్రిష శనివారం తన 37వ పుట్టిన రోజును జరుపుకొన్న విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపిన త్రిష..‘మనం పెళ్లి చేసుకుందాం’ ఇప్పుడు ఇది చట్టబద్దమే అంటూ అందర్నీ చార్మి ట్వీట్‌పై కూడా స్పందించింది.

అయితే తనకు శుభాకాంక్షలు తెలిపిన ఛార్మికి..మన పెళ్లిపై నేనెప్పుడో ఓకే చెప్పేశా..నీదే ఆలస్యం  అంటూ కొంటెగా సమాధానమిచ్చింది త్రిష.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా నడుస్తుంది..ఈ మద్య సినీ తారలు దేనికైనా తెగబడుతున్నారు.. కొంపదీసి వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటారా.. అని ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: