కొందరి దర్శకుల పేరు చెబితే అతికొద్ది కాలంలో తను తీసిన సూపర్ హిట్ సినిమాల జాబితా గుర్తొస్తుంది. అలాంటి అరుదైన దర్శకులలో జాగర్లమూడి రాధాకృష్ణ ( క్రిష్ ) ఒకరు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె...ఈ సినిమాలన్నీ కూడా సినీ ఇండస్ట్రీలో వస్తున్న రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా డిఫ్రెంట్ గా ఆలోచించి తీసిన సినిమాలు. అందుకే క్రిష్ అతి కొద్ది కాలంలోనే మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. 


ఈ కారణం తోనే "గౌతమీ పుత్ర శాతకర్ణి" వంటి భారీ హిట్ ని సొంతం చేసుకున్నాడు. నందమూరి బాలకృష్ణ తన 100వ సినిమాగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చిత్రానికి బాలయ్య క్రిష్ ని దర్శకుడిగా ఎంచుకున్నాడు. అలాగే బాలయ్య అంచనాలకు తగ్గట్టుగానే తన వందవ సినిమాని భారీగా స్థాయిలో తెరకెక్కించి బాలయ్య సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన సినిమాగా మిగిలేలా అద్భుతమైన హిట్ ని ఇచ్చాడు. ఇదే నమ్మకంతో బాలయ్య ఎన్.టి.ఆర్ బయోపిక్ గా బాలకృష్ణ నిర్మాణ సారథ్యంలో రూపొందించిన 
N.T.R కథానాయకుడు, N.T.R మహానాయకుడు చిత్రాలకు అవకాశం ఇచ్చాడు.

అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రెండు చిత్రాలు ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఎంతో నమ్మకంతో దర్శకుడిగా అవకాశం ఇస్తే క్రిష్ బాలయ్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. కానీ ఈ షాక్ బాలయ్య కంటే కూడా క్రిష్ కి గట్టిగా తగిలినట్టుగా టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. అందుకే క్రిష్ బాలీవుడ్ లో స్టార్ హీరోతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇక ఆ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో "గబ్బర్ ఈజ్ బ్యాక్" తెరకెక్కిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు వరుస ఫ్లాప్ లతో ఉన్న క్రిష్ కి ఈ సక్సస్ ఫుల్ హీరో అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.     



మరింత సమాచారం తెలుసుకోండి: