నందమూరి అభిమానుల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ ను అభిమానించే నందమూరి ఫ్యాన్స్ ఎక్కువమంది ఉంటారు. సీనియర్ ఎన్.టి.ఆర్ ను జూనియర్ లో చూసుకుంటే నందమూరి ఫ్యాన్స్ పొందే అనుభూతి మాటల్లో చెప్పలేం. అయితే తన ప్రతి సినిమా ఈవెంట్ లో తన ఫ్యాన్స్ గురించి జాగ్రత్తలు చెప్పే ఎన్.టి.ఆర్ ఇప్పుడు ఓ అభిమాని మరణ వార్త విని ఫేస్ బుక్ లో మెసేజ్ పెట్టడం జరిగింది.


కృష్ణా జిల్లా అభిమాన సంఘ ప్రతినిధి జయదేవ్ మరణ వార్త విన్న తారక్ తన ఫేస్ బుక్ పై అతని గురించి ప్రస్థావిస్తూ ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. "నిన్ను చూడాలని" చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడి గా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రఘాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను. అంటూ ఎన్.టి.ఆర్ జయదేవ్ మృతి పట్ల తన స్పందన తెలియచేశారు.


ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాం చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుందని తెలుస్తుంది. అలియా భట్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయిన ట్రిపుల్ ఆర్ లో నిత్యా మీనన్ కూడా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం 3వ షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పూణెలో లాంగ్ షెడ్యూల్ కు వెళ్లనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: