తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్గ్ గా నటించి అందరిచేత షెభాష్ అనిపించుకున్న నటి సురేఖా వాణి.  తల్లి, అక్క, భార్య పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  సురేఖా వాణి ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్లతో నటించి కడుపుబ్బా నవ్వించింది.  టీవి సీరియల్స్ లో కెరీర్ ఆరంభించిన ఈమె తర్వాత వెండి తెరపై ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ప్రస్తుతం సురేఖా వాణి ఇంట విషాదం నెలకొంది.  ఆమె భర్త సురేష్ తేజ చనిపోయారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సురేష్.. మే 6న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన పలు టీవీ షోలకు డైరెక్టర్‌గా పని చేశారు. సురేష్ తేజ డైరెక్ట్ చేసిన టివి ప్రోగ్రామ్స్ కి సురేఖా వాణి యాంకర్ గా వ్యవహరించారు. 

అలా వీరి మద్య ప్రేమ చిగురించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్ళి చేసుకున్న సురేష్, సురేఖలకు ఒక పాప ఉంది.  కాగా, సురేఖ వాణి భర్త సురేష్ తేజ చనిపోయిన వార్త తెలుసుకొని సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ సంతాపం తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: