సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా యువ దర్శకుడు వంశీ పైడిపల్లి  దర్శకత్వంలో తెరకెకెక్కుతున్న చిత్రం "మహర్షి",  మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా హెగ్డే కథానాయికగా నటించగా "అల్లరి" నరేష్ ఒక ముఖ్య పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రాన్ని ముగ్గురు ప్రముఖ నిర్మాతలైన  దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మాతలు కలిసి నిర్మించారు. 

అయితే ఈ చిత్రం తమ సంస్ధకు ఎంతో ప్రత్యేకమని నిర్మాతల్లో ఒకరైన వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వినీదత్ తెలిపారు. మహేష్ బాబు మొదటి సినిమా "రాజకుమారుడు" ని నిర్మించిన తాను మహేష్ 25వ సినిమాను కూడా నిర్మించడం చాలా గర్వంగా ఉందన్నారు. ఇక ఈ చిత్రం ఈఏడాది మే9న విడుదలవుతోంది. ఈ తేదీకి వైజయంతి మూవీస్ కి ప్రత్యేక అనుబంధముంది, అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి- శ్రీదేవి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం "జగదేకవీరుడు అతిలోక సుందరి", పోయిన ఏడాది వచ్చిన "మహానటి" చిత్రాలు వైజయంతి మూవీస్ సంస్థకు అటు డబ్బుల పరంగానే సంస్థ స్థాయిని పెంచే సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. 

ఇక ఈ రెండు సినిమాలతో పాటు మహేష్ "మహర్షి" కూడా మే9 వ తారీఖున విడుదల అవుతుండడంతో ఆ రెండు సినిమాలలాగే ఈ చిత్రంకూడా ప్రభంజనం సృష్టిస్తుందని వైజయంతి మూవీస్ సంస్థ ఆశిస్తోంది, ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ ని కూడా చేసింది. మరి "మహర్షి" బ్లాక్ బస్టర్ సాధించి వైజయంతికి మే9 న హ్యాట్రిక్ ఇస్తాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: