సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా మహర్షి. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. భారీ బఢెట్ తో ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొట్టింది. ఇక ఇప్పుడు అందరి చూపు మహర్షి నెలకొల్పే రికార్డుల మీద పడ్డది.  మహేష్ మహర్షి టార్గెట్ ఎంత అన్నది హాట్ న్యూస్ గా మారింది.


మహేష్ సత్తా చాటేలా నాన్ బాహుబలి రికార్డులను మహర్షి సృష్టిస్తాడా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మహేష్ మహర్షి సినిమా టార్గెట్ 200 కోట్లను తెలుస్తుంది. కరెక్ట్ సినిమా పడితే మహేష్ కు అసలు ఆ టార్గెట్ పెద్ద లెక్కే కాదు. టికెట్ రేటు పాతిక, 30 ఉన్నప్పుడే 50 కోట్లు వసూళు చేసిన స్టామినా మహేష్ కు ఉంది. అలాంటిది ఇప్పుడు 200 కోట్ల టార్గెట్ అంటే అది సింపుల్ అని చెప్పొచ్చు.


మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అటు ఇటుగా 100 నుండి 120 కోట్ల దాకా జరిగిందని తెలుస్తుంది. ముఖ్యంగా భారీ సంఖ్యలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మొదటి రోజే సాధ్యమైనంత వరకు రాబట్టాలని చూస్తున్నారు. అంతేకాదు వీకెండ్ కల్లా 50 నుండి 70 కోట్ల దాకా వచ్చేలా ప్లాన్ చేశారు. సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు అందుకే మహర్షి మీద అందరి దృష్టి ఉంది. తప్పకుండా మహేష్ అనుకున్న అంచనాలను రీచ్ అవుతాడని అనుకుంటున్నారు.


పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. సినిమాలో మహేష్ 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో ఎట్రాక్షన్ కాగా మహర్షి హంగామా ఎలా ఉంటుందో చూడాలి. పోటీగా సినిమాలేవి లేవు కాబట్టి మహేష్ మహర్షి రికార్డుల ప్రభంజనం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: