కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మాతగా కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు బాలయ్య. "జై సింహ" కాంబినేషన్ గా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక మే 17నుంచి ఈ చిత్రం లాంఛనంగా మొదలుకానున్నట్లు సమాచారం. 

ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ సంగీతదర్శకుడు చిరంతన్ బట్ ని ఫిక్స్ చేసింది చిత్రబృందం. చిరంతన్ బట్ బాలయ్య 100వ చిత్రం "గౌతమీపుత్ర శాతకర్ణి" , "జై సింహ" సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు, ఆ రెండు చిత్రాలు మంచి విజయాలు అందుకోవడంతో ముచ్చటగా మూడోసారి చిరంతన్ బట్ కే
అవకాశమిచ్చాడు బాలయ్య. ఇక ఈ చిత్రం జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఇక ఈ చిత్రంలో విలన్ గా జగపతిబాబు నటిస్తున్నాడు. ప్రస్తుతానికి కథానాయిక వేటలో ఉంది చిత్రబృందం. త్వరలోనే ఈ చిత్ర ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. 







మరింత సమాచారం తెలుసుకోండి: