నందమూరి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ తో సొంత ప్రొడక్షన్ పక్కన పెట్టేశారు. అసలైతే ఈ పాటికల్లా బోయపాటి శ్రీనుతో సొంత ప్రొడక్షన్ లో సినిమా మొదలుపెట్టాల్సింది కాని మళ్లీ ఎందుకో వెనక్కి తగ్గారు. బోయపాటి సినిమా మొదలవుతుంది అనుకుంటే జైసింహా డైరక్టర్ కె.ఎస్ రవికుమార్ తో బాలయ్య మరో సినిమా మొదలుపెట్టాడు. జై సింహా పర్వాలేదు అనిపించగా ఆ సినిమా నిర్మించిన సి.కళ్యాణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.


మే 17 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. హీరోగా కెరియర్ ముగించిన జగపతి బాబు బాలయ్య లెజెండ్ సినిమాతోనే మొదటిసారి విలన్ గా నటించారు. ఆ సినిమాలో అతని విలనిజం బాగుండటంతో జగ్గుభాయ్ టాలీవుడ్ కు సరికొత్త విలన్ అయ్యాడు. అప్పట్లో ప్రకాశ్ రాజ్ సినిమా లేదన్నట్టుగా సినిమాలు వచ్చాయ్.


మరికొంత ముందుకెళ్తే బ్రహ్మానందం లేనిదే సినిమా ఉండేది కాదు అలానే విలన్ గా చిన్న వేషమైనా పెద్దదైనా సరే జగపతి బాబు చేయాల్సిందే. వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ మళ్లీ సూపర్ ఫాంలోకి వచ్చాడు జగపతి బాబు. విలన్ గా కూడా సత్తా చాటుతున్న జగపతి బాబు మరోసారి రవికుమార్ డైరక్షన్ లో సినిమా కోసం బాలయ్యతో గొడవ పడబోతున్నాడు.


బాలకృష్ణ, జగపతి బాబు మాత్రమే ఫైనల్ అయిన ఈ సినిమా మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో వెళ్లడిస్తారట. సి. కళ్యాణ్ ఇప్పటికే రాజశేఖర్ కల్కి సినిమా నిర్మిస్తున్నాడు. ఈమధ్యనే రిలీజైన కల్కి టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. గరుడవేగ తర్వాత రాజశేఖర్ చేస్తున్న ఈ సినిమా కూడా యాంగ్రీ యంగ్ మెన్ కు సక్సెస్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: