బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కడం కొత్తేమి కాదు. హిట్ ఫ్లాప్ లతో సంబధం లేకుండా భారీ బడ్జెట్ తో అగ్ర దర్శక నిర్మాతలు భారీ సినిమాలను రూపొందిస్తుంటారు. అలాంటి మరో భారీ ప్రాజెక్ట్ బాలీవుడ్‌లో రీసెంట్‌గా పట్టాలెక్కింది. అదే "సూర్యవంశీ". 


గతంలో అజయ్ దేవగన్ హీరోగా ‘సింగం’, ‘సింగం రిటర్న్స్‌’, అలాగే రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా సింబాను తెరకెక్కించాడు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి. అయితే ‘సింగం’, ‘సింగం రిటర్న్స్‌’, సింబా సినిమాలలో అజయ్‌, రణ్‌వీర్‌ లను పవర్‌ ఫుల్ పోలీస్ ఆఫీసర్లుగా చూపించాడు. ఈ సినిమాలు బాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టాయి. ఇప్పుడు ఇదే సిరీస్ లో భాగంగా అక్షయ్ కుమార్ హీరోగా "సూర్యవంశీ" అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రోహిత్‌ శెట్టి. 


విశేషమేమిటంటే  అక్షయ్‌ కుమార్‌ను కూడా పోలీస్‌గా చూపించబోతున్నారు రోహిత్‌ శెట్టి. ఇక ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మిస్తుండగా కత్రినా కైఫ్‌ ను హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, రణ్‌వీర్‌సింగ్  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారట. అయితే ఈ ఇద్దరు పోలీస్ గెటప్ లో కనిపిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక కరణ్ జోహార్ నిర్మాత అంటే ఇతర టాప్ హీరో, హీరోయిన్స్ కూడా అతిథి పాత్రల్లో కనిపిస్తుంటారు. మరి ఈ సినిమాలో ఎవరెవరు కనిపిస్తారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.     


మరింత సమాచారం తెలుసుకోండి: