కీర్తి సురేశ్ మ్యానియా నాగార్జున ‘మన్మధుడు 2’ ఉపయోగపడబోతోందా అన్న సంకేతాలు వస్తున్నాయి. ‘మహానటి’ సూపర్ సక్సస్ తరువాత టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ నుండి ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చినా వాటిని అంగీకరించకుండా ప్రస్తుతం ఆమె మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఒక స్పోర్ట్స్ డ్రామా మూవీలో నటిస్తోంది .

ప్రస్తుతానికి ఈమె అనేక తమిళ సినిమాలలో టాప్ హీరోల పక్కన నటిస్తున్న నేపధ్యంలో ఈమె డేట్స్ దొరకడం చాల కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమె నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు 2’ మూవీలో  ఒక ప్రత్యెక పాత్ర చేయడానికి అంగీకరించి నట్లు గా వార్తలు వస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో తన కోసం క్రియేట్ చేసిన పత్యేక పాత్ర కీర్తికి బాగా నచ్చడంతో ‘మన్మధుడు 2’ లో నాగార్జున పక్కన ఈ ప్రత్యేక పాత్రలో నటించడానికి వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

 తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఇజ్రాయల్ లో షూటింగ్ జరుపుకుంటున్న ‘మన్మధుడు 2’ షూటింగ్ షెడ్యూల్ ముగిసిన తరువాత హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ లో నాగ్ కీర్తి సురేశ్ లపై కీలక సన్నివేశాలు చేయబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ సినిమాలో మరో కీలక పాత్ర సమంత చేస్తున్న పరిస్థుతులలో ఈమూవీ పై మరింత క్రేజ్ పెంచడానికి కీర్తి సురేశ్ ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.

గత కొంత కాలంగా నాగార్జున సినిమాలు అన్నీ వరస పరాజయాలు చెందుతున్న పరిస్థుతులలో నాగార్జున మార్కెట్ బాగా పడిపోయింది. దీనితో నాగ్ సొంతంగా నిర్మిస్తున్న ‘మన్మధుడు 2’ కు క్రేజ్ పెంచడానికి రకుల్ ప్రీత్ తో పాటు ఇలా కీర్తి సురేశ్ సమంతల సహకారం కూడ తీసుకుంటున్నారు అనుకోవాలి..
  


మరింత సమాచారం తెలుసుకోండి: