గత కొంత కాలం నుండి అక్కినేని ఫ్యామిలీకి బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్టు పడలేదు. ఇటువంటి తరుణంలో అక్కినేని నాగచైతన్య సమంత కలిసి నటించిన మజిలీ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించడంతో ఆ సక్సెస్ను ఎంతగానో ఆస్వాదించారు అక్కినేని నాగార్జున. మరియు అదే విధంగా నాగార్జున కూడా హిట్టు కొట్టి చాలాకాలమైంది..ఇటువంటి తరుణంలో తన కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయిన మన్మధుడు సినిమా సీక్వెల్ చేస్తున్నారు.

Related image

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున పక్కన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మరొక హీరోయిన్ కి అవకాశం ఉన్నా నేపథ్యంలో డైరెక్టర్ రాహుల్ కీర్తి సురేష్ ని సంప్రదించారట. అయితే తనకు ఆ సినిమాలో నటించడానికి డేట్స్ కుదరదని సర్దుబాటు కూడా చేసే అవకాశం లేదని కీర్తి సురేష్ అన్నట్టు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.

Related image

ఈ నేపథ్యంలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ “మా సినిమాలో మ‌రో క‌థానాయిక అవ‌స‌ర‌మే. ఆ పాత్ర కోసం చాలా అనుకుంటున్నాము, అందుకోసమని కీర్తి సురేష్ ని సంప్రదిస్తే ఇంకా తననుండి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. కానీ ఈ చిత్రంలో నటించేందుకు కీర్తి ఆశగా ఉందని, డేట్స్ కుదరకపోవడం వలన ఇంకా ఏం సమాధానం చెప్పలేదని వినికిడి. అయితే మరోపక్క నాగార్జున పక్కన నటించే రెండో హీరోయిన్ పాత్రలో సరైన వెయిట్ లేని క్యారెక్టర్ అని కీర్తి సురేష్ నాగార్జున ఆఫర్ ని తిరస్కరించినట్లు మరో వాదన వినబడుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అతిధి పాత్రలో సమంత కూడా నటిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: