టాలీవుడ్ లో ఈ మద్య ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా వెండి తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే.  కొంత కాలంగా డైరెక్లర్లు, నిర్మాతలు, కొరియో గ్రాఫర్ల వారసులు కూడా వెండి తెరపై తమ సత్తా చూపిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ప్రముఖ ఛాయా గ్రహకుడు చోటా కే నాయుడు మేనళ్లుడు సందీప్ కిషన్ హీరోగా వచ్చారు.  మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్ పాత్రల్లో నటించిన సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు.  తెలుగు లోనే కాదు తమిళ భాషల్లో కూడా సందీప్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. 

ఏ పాత్రను ఇచ్చినా అందులో ఒదిగిపోయి చేసే యువకథానాయకులలో సందీప్ కిషన్ ఒకరు. తాజా చిత్రంగా 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' రూపొందుతోంది.   ఈ సినిమా జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమా పోస్టర్ బట్టి చూస్తే నవ్వులే నవ్వులు అన్నట్లుగా ఉంది. మొదటి నుంచి  హాస్య ప్రధానమైన చిత్రాలను తనదైన శైలిలో తెరపై ఆవిష్కరించి నవ్వులు పూయించడంలో జి. నాగేశ్వర రెడ్డి ఒకరు. 

ఈ సినిమాలో సందీప్ కిషన్ కేసులు లేని లాయర్ గా నటిస్తున్నాడు. సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. మరో ముఖ్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనున్నారు. ఈ రోజున సందీప్ కిషన్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు.ఈ కామెడీ ఎంటర్టైనర్ అయినా ఆయనకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: