హీరో విల‌న్ మాత్ర‌మే కాక క్యారెక్ట్ ఆర్టిస్ట్‌గా కూడా త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శిస్తారు ఆదిప‌నిశెట్టి. ఇటీవ‌లె క్రీడా నేప‌థ్యంలో కొన‌సాగే ఓ చిత్రానికి సంత‌కం చేశారు. ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ఆది గ‌త చిత్రాలన్నింటికి భిన్నంగా ఉంటుంది. స్పోర్ట్స్ జోన‌ర్ చిత్రంలో ఆది పినిశెట్టి న‌టించ‌డం ఇదే తొలిసారి.

ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్‌లో ఒకేసారి రూపొందించ‌నున్నారు. ఆది పినిశెట్టితో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చినందుకు ఆనందంగా ఉన్న ద‌ర్శ‌కుడు ప్రిత్వి ఆదిత్య మాట్లాడుతూ ``నేను ఈ క‌థ‌ను రాసుకుంటున్నంత సేపూ నా మ‌న‌సులో ఆదిగారే మెదిలారు. ఆయ‌న‌కు క‌థ వినిపించాక‌, ఆయ‌న `స‌రే చేస్తాను` అని చెప్ప‌గానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డానికి ఉత్సాహంగా ఉంది. త‌ప్ప‌కుండా మంచి ప‌నితీరును క‌న‌బ‌రుస్తాను. అథ్లెటిక్స్‌కు సంబంధించిన క‌థ ఇది.

త‌ను క‌న్న క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి క‌థానాయ‌కుడు చేసిన ప్ర‌య‌త్నం ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అథ్లెటిక్స్ ప‌ట్ల అంద‌రికీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ప్ర‌స్తుతం మిగిలిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం`` అని అన్నారు. ఈ చిత్రాన్ని ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్నారు. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ సంస్థ రూపొందిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: