టాలీవుడ్ లో ఒకప్పుడు అందాల తార మహానటి సావిత్రి అంటే ఎంతో గొప్ప పేరు ఉండేది.  ఆమె కాల్ షీట్స్ కోసం హీరోలు ఎదురు చూసే వారంటే ఆమె ఎంతో గొప్ప నటి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి డ్యాన్స్,నటన నేర్చుకొని అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది సావిత్రి.  ఆమె జీవతం పై ఇటీవల ‘మహానటి’సినిమా తీశారు. 

అయితే టాలీవుడ్ లో సావిత్రి పేరు రాగానే వెంటనే జమున పేరు వస్తుంది.  వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు..అంతే కాదు అక్కాచెల్లెళ్ల లా కలిసి ఉండేవారని చిత్ర పరిశ్రమలో అనుకుంటారు.  తాజాగా నటి జమున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..సావిత్రీ బయోపిక్ ‘మహానటి’ గురించి మాట్లాడారు.  సావిత్రి బయోపిక్ తీసే సమయంలో తనను ఎవరూ కలవలేదని..అయితే అందరికంటే ఎక్కువగా ఆమె లైఫ్ స్టైల్ గురించి నాకే తెలుసని అన్నారు. 

ఆమె ఎదుగుదల..పతనం నేను దగ్గరుండి చూశానని.. నాకు .. సావిత్రికి ఎంతో అనుబంధం వుంది. ఆమెతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించానని అన్నారు. అలాంటిది సావిత్రి బయోపిక్ తీసే సమయంలో తన గురించి నా వద్దకు ఎవరూ రాలేదని అన్నారు. నా అభిప్రాయాలను కూడా తీసుకుని వుంటే, సినిమాకి మరింత ఉపయోగకరంగా ఉండేదని నేను అనుకుంటున్నాను  అని ఆమె చెప్పుకొచ్చారు. 

సావిత్రి చివరి రోజుల్లో ఆమెకు ఎన్నో మంచి మాటలు చెప్పానని..కొడైకెనాల్ లో సావిత్రికి ఒక ఇల్లు వుండేది. ఆమె ఆ ఇంట్లో ఉండగా, నేను షూటింగు కోసమని చెప్పి కొడైకెనాల్ వెళ్లాను.  అప్పుడు తనను కలిసి ఈ ఇల్లు అమ్మి నీ పేరుపై ఫిక్స్ డిపాజిట్ చేసుకోమని..నీ పిలల్ల భవిష్యత్ కోసం డబ్బు దాచుకోమని చెప్పాను. ఇక నువ్వు వాళ్ల కోసమే బతకాలి అని చెప్పాను. అయినా సావిత్రి వినిపించుకోలేదు  అని చెప్పుకొచ్చారు.  సావిత్రి జీవితం నిజంగానే ఎంతో మందికి ఉదాహారణగా నిలిచిపోయిందని ఆవేదన చెందారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: