స్టార్ సినిమా ఎనౌన్స్ మెంట్ ఫ్యాన్స్ కు భలే ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అది జరిగే కాంబినేషనా కాదా అని ఆలోచించరు.. ఎనౌన్స్ మెంట్ వచ్చింది అంటే ఇక సినిమా వచ్చేసినట్టే అనే ఫీలింగ్ లో ఉంటారు. అలానే ప్రముఖ పారిశ్రామిక వేత్త టి.సుబ్బిరామిరెడ్డి గారు మొన్నామధ్య ఓ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తీస్తానని ఎనౌన్స్ చేశారు. 


మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కనబడితే చాలు అనుకుంటుంటే ఇద్దరు కలిసి సినిమా చేస్తారంటూ హామి ఇచ్చాడు సుబ్బిరామిరెడ్డి. ఈ సినిమాకు డైరక్టర్ గా త్రివిక్రం శ్రీనివాస్ పనిచేస్తారని అన్నారు. ఆల్రెడీ కథ కూడా రెడీ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే ఎనౌన్స్ మెంట్ చేయడమే కాని ఇప్పటివరకు ఆ మల్టీస్టారర్ సినిమా గురించి ఎలాంటి వార్త బయటకు రాలేదు.


ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి అసలిక సినిమాలు చేస్తాడా లేదా అన్న డౌట్ కూడా ఉంది. కాని ఎలాగు ఎలక్షన్స్ ముగిశాయి కాబట్టి మళ్లీ ముఖానికి రంగేసుకోడానికి పవన్ రెడీ అవుతున్నారట. ప్రస్తుతం పవన్ సినిమా కథా చర్చలు నడుస్తున్నాయని తెలుస్తుంది. మరి చిరుతో పవన్ సినిమా ఎప్పుడు ఉంటుంది.. ఎలా ఉండబోతుంది.. అన్నది మెగా ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ పెరిగిపోతుంది.


వాళ్లిద్దరు చేసేందుకు రెడీ అంటే త్రివిక్రం ను ఒప్పించడం పెద్ద కష్టమేమి కాదు. మెగా ఫ్యామిలీకి బాగా సన్నిహితుడు కాబట్టి త్రివిక్రం కొద్దిగా టైం అడిగితే ఇద్దరికి సరిపడే కథ రాసేస్తాడు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఒకే స్క్రీన్ పై చూడాలన్న అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. ప్రస్తుతం చిరంజీవి సైరా నరసిం హా రెడ్డి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇంత ఏజ్ వచ్చినా ఆ సినిమా కోసం రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: