పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రం శ్రీనివాస్ ఇద్దరు ఎంత గొప్ప స్నేహితులో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ డేట్స్ ఇవ్వాలేగాని త్రివిక్రం తన పనులన్నీ పక్కన పెట్టేసి కళ్యాణ్ గారి ముందు వాలిపోతారు. ఎందుకంటే ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం అటువంటిది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా సినిమాచూసి పవర్ స్టార్ అభిమానులు చేసుకున్న జల్సా అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సస్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా నుండి పవర్ స్టార్-త్రివిక్రంల మధ్య బంధం మరింత బలపడింది. 


వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకొని 100 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే సోషల్ మీడియాలో లీకైంది...అయినప్పటికి ఈ లీకుల బెడద ఏమాత్రం సినిమాపై కాస్త కూడా ప్రభావం చూపలేకపోయింది. అది పవర్ స్టార్ స్టామినా అంటే. ఇంత సెన్సేషనల్ ని క్రియేట్ చేసిన అత్తారింటికి దారేది తర్వాత పవర్ స్టార్-త్రివిక్రం కాంబినేషన్‌లో అజ్ఞాతవాసి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకి పవర్ స్టార్ పవర్ గాని, మాటల మాంత్రీకుడి స్టామినా గాని పనిచేయలేదు. పవర్ స్టార్ అభిమానుల అంచనాలను తారు మారు చేస్తూ డిజాస్టర్‌గా మిగిలింది. అందుకే త్రివిక్రం ఈసారెలాగైనా భారీ హిట్టివ్వాలని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అయిపోయి సినిమాలకు గుడ్‌బాయ్  చెప్తున్నట్లు ప్రకటించారు. 


పవన్ కళ్యాణ్ ఇలా ప్రకటించగానే తన అభిమానులు ఒక్కసారిగా ఢీలా పడిపోయారు. అయితే ప్రస్తుతం ఎలక్షన్ల హడావిడి లేదు కాబట్టి తమకోసం ఒక్క సినిమానైనా చేస్తే బావుంటుందని పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆరాట పడుతున్నారు. ఈ సినిమా కూడా తన ప్రియ మిత్రుడు త్రివిక్రం దర్శకత్వంలో అయితే పవర్ స్టార్ కాదనే అవకాశం ఉండదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి త్రివిక్రం కి డేట్స్ ఇస్తే ఖచ్చితంగా హిట్టు కొడదాం అనే గట్టి నమ్మకంతో ఉన్నారట. మరి పవర్ స్టార్ తన అభిమానులకు, మిత్రుడు త్రివిక్రం కి ఏం చెప్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: