సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. యూఎఈలో సెన్సార్ కాపీ చూసి అనంతరం ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. ‘మహర్షి' మూవీ అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న అద్భుతమైన సినిమా. తీరకెక్కించిన విధానం అద్భుతంగా ఉంది అంటూ పొగడ్తలు గుప్పించాడు. ఉమైర్ సంధు ట్వీట్ చూస్తుంటే ‘మహర్షి' కథ ప్రేక్షకులను కట్టి పడేసే విధంగా ఉంటుందని, స్క్రీన్ ప్లే వినోదాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది. 


ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. కాలేజీ కుర్రాడిగా, కంపెనీ సీఈఓగా, ఆ తర్వాత రైతుగా విభిన్నమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరించబోతున్నారు. నటన పరంగా, లుక్ పరంగా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే విధంగా మహేష్ బాబు పెర్పార్మెన్స్ ఉందని ఉమైర్ సంధు తన రివ్యూలలో పేర్కొన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమా కోసం ఎంచుకున్న సబ్జెక్ట్ ఎంతో అద్భుతంగా ఉందని, అందరికీ కనెక్ట్ అయ్యే ఎంగేజింగ్ సోషల్ థ్రిల్లర్ అంటూ ఉమైర్ సంధు పేర్కొన్నారు.


ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కథలో ఎంతో డెప్త్ ఉన్న విషయం స్పష్టమవుతోంది. హీరోయిన్ పూజా హెగ్డే తన స్టన్నింగ్ లుక్, గ్లామరస్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిందని ఉమైర్ సంధు తెలిపారు. ఇందులో అల్లరి నరేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తన ట్వీట్లో ఉమైర్ సంధు అతడి ప్రస్తావన తేక పోవడం గమనార్హం. అయితే చిత్ర బృందం మాత్రం నరేష్ రోల్ కథలో బాగా హైలెట్ అయ్యేలా ఉంటుందని స్పష్టం చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: