తొంబయ్యె దశకంలో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం "మన్నన్" తమిళనాట సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..ముఖ్యంగా రజనీకాంత్-విజయశాంతి నడుమ సాగే హోరా హోరి సన్నివేశాలు ఈ చిత్ర విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. "చంద్రముఖి" ఫేమ్ పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. 

అయితే ఈ చిత్రంలో మెయిన్ లీడ్ గా తమిళ యుయువకథానాయకుడు శింబుని, లేడీ సూపర్ స్టార్ నయనతారని తీసుకునే యోచనలో ఉన్నారట. అయితే శింబు-నయనతార మంచి ప్రేమికులు. ఒకానొక దశలో పెళ్లిదాక వెళ్ళిన వీరి ప్రేమ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరవాత శింబు, నయన్ పెద్దగా కలిసి నటించింది లేదు. మరి ఈ చిత్రంతో మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ పై సందడి చేస్తుందా? అనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. 

ఇక రాజకీయాల్లో, సినిమాలల్లో జీవిత కాల శత్రువులు ఉండరు కాబట్టి ఈ సినిమాలో నటించేందుకు నయన్- శింబు ఒప్పుకుంటారని భావిస్తోంది ఈ చిత్ర నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్. మరి వీరిద్దరి మరోసారి కలిసి నటించి వారి అభిమానులను అందంపరుస్తారో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: