తెలుగు ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా రేపటి రోజు కోసం ఎదురు చూస్తున్నారు.  భరత్ అనే నేను సినిమా తర్వాత వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘మహర్షి’.  ఈ సినిమాకు సంబంధించి టీజర్, ట్రైలర్, లిరిక్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది.  అప్పడే ‘మహర్షి’పై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  ఒక సామాన్య యువకుడు కష్టపడి విదేశాల్లో బిలీనియర్ ఎలా అయ్యాడు..తిరిగి భారత దేశానికి వచ్చి సామాన్య రైతుగా ఎందుకు మారాడు..ఈ క్రమంలో విలన్లను ఎలా ఎదుర్కొన్నాడు..కథా సారంశం.

ఈ మద్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యు/ఏ సర్టిఫికేట్ పొందింది. దుబాయ్ లో కూడా విడుదలవుతోన్న ఈ సినిమా అక్కడ కూడా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. అక్కడి సెన్సార్ బోర్డ్ సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తెలుగు సినిమాలకు ఫస్ట్ రివ్యూలు ఇస్తోన్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు 4 స్టార్లు ఇచ్చారు..అంటే సినిమా మంచి హిట్ టాక్ అన్నమాట.

దర్శకుడు వంశి అన్ని యాంగిల్స్ లో మహేష్ బాబుని ఎంతో గొప్పగా చూపించారని.. సోషల్ థ్రిల్లర్ గా ఈ సినిమాను రూపొందించినట్లు, పూజా హెగ్డే తన నటనతో ఆశ్చర్యపరిచిందని అన్నారు.  సెంటిమెంట, ఎమెషన్ డైలాగ్స్, బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని అన్నారు. మొత్తానికి ఈ మూవీ పైసా వసూల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా బ్యానర్లపై దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి. పొట్లూరి నిర్మించారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: