బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఎంతో కష్టపడి జీరో సినిమాలో నటించి, నిర్మించాడు. ఆనంద్. ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్స్ గా నటించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరిశాడు. జబ్ తక్ హై జాన్ తర్వాత షారుఖ్, కత్రినా, అనుష్క కలిసి నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై మొదటి నుంచి అటు షారుఖ్ ఫ్యాన్స్ లో, ప్రేక్షకుల్లో బారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే అందరి అంచనాలను తారు మారు చేస్తూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడి డిజాస్టర్ గా మిగిలింది. 


ఒక రకంగా షారుఖ్ కి ఇది పెద్ద దెబ్బే. ఎందుకంటే ఎప్పుడో కమల్ హాసన్ మరగుజ్జుగా నటించిన విచిత్ర సోదరులు బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకొని కమల్ కెరీర్ లో ది బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. అదే ఇన్స్పిరేషన్ తో షారుఖ్ ఈ సినిమాలో మరగుజ్జుగా ఎంతో కష్టపడి నటిస్తే అది ప్రేక్షకులకు రుచించలేదు. దాంతో షారుఖ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆర్ధికంగా కూడా పెద్ద దెబ్బ తిన్నాడు. ఇక ఇప్పటి నుంచి ఎలాంటి సినిమాలు చేయాలి, చేస్తే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న సందేహం లో పడిపోయాడు. అందుకే ఇంకా ఏ సినిమాను అంగీకరించలేదు. 


అంతేకాదు తన సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ నుండి కూడా షారుఖ్ కొత్త ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేయలేదు. అయితే ఐ.పి.ఎల్ లో మాత్రం కోల్‌కత్తా నైట్ రైడర్స్ టీం కి సారధ్యం వహిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. మరి ఈ ఐ.పి.ఎల్ తర్వాత అయినా షారుఖ్ తన కొత్త సినిమా కబురును వినిపిస్తాడో లేదో చూడాలి.  అయితే ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే జీరో సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కి నామినేట్ అవడం.         


మరింత సమాచారం తెలుసుకోండి: