పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో నితిన్ "హార్ట్ ఎటాక్" అనే మాస్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేశాడు. అయితే ఈ సినిమాతో నటుడిగా నితిన్ ని కొత్త కోణంలో చూపించగలిగాడుగానీ హిట్ ని మాత్రం ఇవ్వ లేకపోయాడు. ఈ సినిమా థియోట్రికల్ ట్రైలర్, సాంగ్స్ రిలీజైనప్పుడు గ్యారెంటీగా పూరీ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడని ఇండస్ట్రీ అంతా అనుకున్నారు. అంతేకాదు హీరో నితిన్ కూడా డిఫ్రెంట్ మేకోవర్, డిఫ్రెంట్ లుక్ తో స్క్రీన్ మీద బాగా కష్టపడ్డాడు. 


కానీ ఆ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కలేదు. రిలీజైన రోజునుండే యావరేజ్ టాక్ ని తెచ్చుకున్న ఈ సినిమా కమర్షియల్ గా సక్సస్ ని సాధించలేకపోయింది. కానీ పూరీ స్టామినాని మరోసారి చూపించగా, నితిన్ తన పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. అందుకే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా చేయాలని డిసైడయ్యారు. అందుకే పూరీ కూడా మంచి కథను నితిన్ కోసం రెడీ చేసి వినిపించాడు. ఈ కథ నితిన్ కి బాగా నచ్చడంతో వెంటనే డేట్స్ ఇవ్వడానికి కూడా సిద్దమైపోయాడట. అయితే ఉన్నట్టుండి నితిన్ పూరికి నో చెప్పి ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకున్నాడని ఇండస్ట్రీ టాక్. అందుకు కారణం "ఛార్మి" అని గట్టిగానే వినపడింది. 


అసలు విషయం ఏమిటంటే నితిన్ తో పూరీ సినిమా ఫైనల్ కాగానే ప్రొడక్షన్ వ్యవహారాలు ఛార్మి చూసుకుంటుందని నితిన్ తో పూరీ చెప్పారట. అయితే నితిన్ తన సొంత బ్యానర్‌పై సినిమాని నిర్మించాలనుకున్నాడట. ఇక్కడే ఇద్దరికి బెడిసికొట్టి పూరీకి నో చెప్పాడని టాక్. ఆ తర్వాత నితిన్ "భీష్మ" సినిమాతో బిజీ కాగా, పూరీ ఎనర్జిటిక్ హీరో రామ్ తో "ఇస్మార్ట్ శంకర్" ని తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నట్టు ఈ సినిమాకి కూడా ఛార్మి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన "ఇస్మార్ట్ శంకర్" మోషన్ టీజర్ పూరీ మార్క్‌ని చూపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: